33 ఏళ్ల తర్వాత మళ్లీ క్రేజీ కాంబో ?

33 ఏళ్ల తర్వాత మళ్లీ క్రేజీ కాంబో ?

Published on Oct 7, 2024 10:00 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్‌.. క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం 33 ఏళ్ల తర్వాత తిరిగి సినిమా చేయబోతున్నారా ?, అవుననే చెబుతున్నాయి కోలీవుడ్‌ అప్ డేట్స్. 1991లో రజనీ – మణిరత్నం కలయికలో వచ్చిన ‘దళపతి’ అద్భుత విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఆ సినిమాకి బాక్సాఫీస్‌ దగ్గర భారీ కలెక్షన్స్ వచ్చాయి. కానీ, ఆ తర్వాత ఎందుకో.. ఈ ఇద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. ఐతే, 33 ఏళ్ల తర్వాత మళ్లీ రజనీ – మణిరత్నం కాంబో సెట్ అవ్వబోతుందట. ఈ సినిమాకి సంబంధించి రజనీకాంత్, మణిరత్నంకు మధ్య చర్చలు కూడా జరిగాయట.

ఇప్పడున్న సమాచారం ప్రకారం అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబరులో రజనీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మణిరత్నం ప్రస్తుతం కమల్‌ హాసన్‌ తో ‘థగ్‌ లైఫ్‌’ సినిమా చేస్తున్నాడు. అటు సూపర్ స్టార్ రజనీకాంత్‌ నటించిన ‘వేట్టయన్‌’ విడుదలకు రెడీ అయ్యింది. అలాగే, రజని నటిస్తోన్న మరో చిత్రం ‘కూలీ’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అదేవిధంగా ‘జైలర్‌ 2’ పట్టాలెక్కేందుకు రెడీగా ఉంది. ఈ సినిమాల తర్వాత రజనీ – మణిరత్నం కాంబో సెట్స్ పైకి వెళ్తుందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు