సెన్సార్ ముగించుకున్న ‘విశ్వం’.. రన్‌టైమ్ ఎంతంటే?

సెన్సార్ ముగించుకున్న ‘విశ్వం’.. రన్‌టైమ్ ఎంతంటే?

Published on Oct 9, 2024 12:00 AM IST

మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విశ్వం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కిస్తుండటంతో అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్లు కూడా ఇంపాక్ట్ చూపెట్టడంతో ఇప్పుడు అభిమానులు ‘విశ్వం’ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ‘విశ్వం’ మూవీ సెన్సార్ పనులు కూడా ముగించుకుని రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘యు/ఎ’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ చిత్ర రన్‌టైమ్ 2 గంటల 36 నిమిషాలుగా లాక్ చేశారు మేకర్స్. ఈ సినిమా అన్ని వర్గాల ఆడియెన్స్‌ను మెప్పి్స్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. అక్టోబర్ 11న ఈ సినిమా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు