ఓటిటిలో మంచి స్పందనతో ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

ఓటిటిలో మంచి స్పందనతో ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Published on Oct 12, 2024 9:30 AM IST


టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటీనటులు చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన రీసెంట్ చిత్రమే ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. మరి ముందు థియేటర్స్ లో విడుదల అయ్యి తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం ఇక్కడ మాత్రం మంచి రెస్పాన్స్ తో ట్రెండ్ అవుతోంది. కీడా కోలా తో చైతన్య రావుకి మంచి బ్రేక్ వచ్చింది ఈ క్రమంలో రీసెంట్‌గా వచ్చిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌కి థియేటర్లో, ఓటీటీలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.

ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం ఆల్రెడీ ట్రెండ్ అవుతోంది. ఆల్రెడీ 70 మిలియన్ల మినిట్స్ వ్యూస్‌ను క్రాస్ చేసింది. చైతన్య రావ్, హెబ్బా పటేల్‌ల జంటకు, నటన, కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ను కేకేఆర్, బాల రాజ్ నిర్మించగా.. బాల రాజశేఖరుని దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కళ్యాణీ మాలిక్ అందించిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సిస్ట్లా వీఎంకే కెమెరా పనితనానికి మంచి మార్కులు పడ్డాయి.

ఇక ఈ చిత్రం ఇప్పుడు ఆహా లోకి కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మొదట్లో అమెజాన్ ప్రైమ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రం గత కొన్ని రోజులుగా ఆహా వినియోగ దారుల్ని సైతం ఎంటర్టైన్ చేస్తోంది. బిగ్ ఫిష్ సినిమాస్ ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు