లాంఛనంగా ప్రారంభమైన ‘నా నిరీక్షణ’ చిత్రం

లాంఛనంగా ప్రారంభమైన ‘నా నిరీక్షణ’ చిత్రం

Published on Oct 12, 2024 8:47 AM IST

పికాక్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై పి.సంతోష్ రెడ్డి నిర్మాణంలో అమర్ దీప్ హీరోగా, లిషి గణేష్ కల్లపు హీరోయిన్‌గా సాయి వర్మ దాట్ల దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం ‘నా నిరీక్షణ’. దసరా సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు గ్రాండ్‌గా జరిగాయి. ‘నా నిరీక్షణ’ మూవీ పూజా కార్యక్రమాలకు దిల్ రాజు, సురేష్ బాబు, రాజా రవీంద్ర తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ముహూర్తపు సన్నివేశానికి దిల్ రాజు క్లాప్ కొట్టగా, రాజా రవీంద్ర స్క్రిప్ట్ అందజేశారు. నిర్మాత గణపతి రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సాయి వర్మ దాట్ల మాట్లాడుతూ.. ‘దసరా పండుగ అయినా మా టీంను ఆశీర్వదించేందుకు వచ్చిన సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, రాజా రవీంద్ర గారికి థాంక్స్. సినిమా కథ గురించి ఇప్పుడే చెప్పలేను కానీ ఓ మంచి చిత్రాన్ని అయితే తీస్తున్నాను’ అని అన్నారు.

అమర్ దీప్ మాట్లాడుతూ.. ‘హీరోగా ఇది నా రెండో చిత్రం. బిగ్ బాస్ తరువాత సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ స్క్రిప్ట్ ఇది. దర్శక, నిర్మాతలు ఈ మూవీ మీదే ఏడు నెలలు పని చేశారు. వారి వల్లే ఈ మూవీ ఇక్కడికి వరకు వచ్చింది. నన్ను నమ్మి ఇంత మంచి అవకాశం ఇచ్చిన వారికి థాంక్స్’ అని అన్నారు.

చైతన్య వర్మ మాట్లాడుతూ.. ‘మా చిత్రాన్ని ఆశీర్వదించేందుకు వచ్చిన సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, రాజా రవీంద్ర గారికి థాంక్స్. ఇది వరకు నన్ను హిట్, ఝాన్సీ, సరెండర్ వంటి సినిమాల్లో చూశారు. ఈ చిత్రంలో నాకు మంచి పాత్ర లభించింది. మా చిత్రాన్ని ఆడియెన్స్ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు