‘రాజా సాబ్’ పై నిర్మాత క్రేజీ కామెంట్స్

‘రాజా సాబ్’ పై నిర్మాత క్రేజీ కామెంట్స్

Published on Oct 14, 2024 8:33 PM IST

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ‘ది రాజా సాబ్’ అనే భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి టాలీవుడ్‌ నిర్మాత శ్రీనివాస కుమార్‌(ఎస్‌కెఎన్‌) ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుగుతున్నట్లు చెప్పారు. ‘అక్టోబర్‌ 23న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ ప్రారంభమవుతాయి. ఆ తర్వాత వరుసగా వస్తాయి. దీనికోసం దర్శకుడు మారుతి, నిర్మాత విశ్వప్రసాద్‌ ప్రణాళికలు వేసుకున్నారు. త్వరలోనే ‘రాజాసాబ్‌’ అప్‌డేట్స్ గురించి వివరాలు వెల్లడిస్తాం. అక్టోబర్‌ 23 నుంచి విడుదల వరకు ‘రాజాసాబ్‌’ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తాం’ అని ఎస్‌కెఎన్‌ చెప్పుకొచ్చారు.

దర్శకుడు మారుతి ఒక్కరోజు కూడా వృథా కాకుండా ఈ సినిమా చిత్రీకరణ చేస్తున్నారని… వినాయకచవితి, దసరా.. ఇలా ఏ పండగకు కూడా ఆయన సెలవు తీసుకోకుండా కష్టపడుతున్నారని.. అనుకున్న సమయంలో సినిమాను విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నారని ఎస్‌కెఎన్‌ తెలిపారు. అన్నట్టు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌, మాళవిక మోహన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు