సూర్య కోసం రానున్న రజినీకాంత్, ప్రభాస్..?

సూర్య కోసం రానున్న రజినీకాంత్, ప్రభాస్..?

Published on Oct 15, 2024 11:02 AM IST

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కంగువా’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు శివ డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి ఫాంటెసీ యాక్షన్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యింది. ఇక ఈ సినిమాలో సూర్య వైవిధ్యమైన గెటప్‌లో కనిపిస్తుండటం.. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.

‘కంగువా’ చిత్రాన్ని తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో తెలుగులోనూ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్‌ను కూడా తారాస్థాయిలో నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ‘కంగువా’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత గ్రాండ్‌గా నిర్వహించాలని.. ఈ ఈవెంట్ కోసం తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, రెబల్ స్టార్ ప్రభాస్‌లను ముఖ్య అతిథులుగా తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోందట.

ఒకే వేదికపై సూర్య, రజినీకాంత్, ప్రభాస్‌లను చూస్తే అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. మరి నిజంగానే ‘కంగువా’ కోసం ఈ స్టార్ హీరోలు వస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తుండగా దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. నవంబర్ 14న ‘కంగువా’ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు