ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ మూవీ ‘కలి’

ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ మూవీ ‘కలి’

Published on Oct 17, 2024 9:00 PM IST

టాలీవుడ్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయిన థ్రిల్లర్ మూవీ ‘కలి’ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో రెస్పాన్స్‌ను దక్కించుకోలేకపోయింది. ఈ సినిమాలో యంగ్ హీరో ప్రిన్స్ సిసిల్, నరేష్ అగస్త్య ముఖ్య పాత్రల్లో నటించారు. శివ శేషు డైరెక్ట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 4న థియేటర్లలో రిలీజ్ అయ్యింది.

ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ లో ‘కలి’ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎంగేజింగ్ థ్రిల్లర్ కథ ఈ చిత్రాన్ని ఓటీటీ ఆడియెన్స్‌కి దగ్గర చేస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు. ఆత్మహత్య ఆలోచనపై ఈ సినిమా కథ నడుస్తుంది.

ఈ చిత్రాన్ని లీలా గౌతమ్ వర్మ ప్రొడ్యూస్ చేయగా, జీవన్ బాబు సంగీతం అందించాడు. ఈ సినిమాలో నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి. తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు