దయచేసి చప్పట్లు కొట్టొద్దు – శ్రేయా ఘోషల్‌

దయచేసి చప్పట్లు కొట్టొద్దు – శ్రేయా ఘోషల్‌

Published on Oct 21, 2024 1:00 PM IST

పశ్చిమ బెంగాల్‌ లో జూనియర్‌ వైద్యురాలి హత్యాచార ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్‌ గతంలో తన కాన్సర్ట్‌ను వాయిదా వేసుకున్నారు. అయితే, తాజాగా ఆ కాన్సర్ట్‌ను శ్రేయా ఘోషల్‌ నిర్వహించారు. ‘ఆల్‌ హార్ట్స్‌ టూర్‌’లో భాగంగా కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ‘గాయపడిన నా శరీరం బాధను ఈ రోజు మీరు వింటున్నారు..’ అంటూ సాగే పాటను శ్రేయా ఘోషల్‌ ఉద్వేగభరింతగా ఆలపించారు.

శ్రేయా ఘోషల్‌ ఇంకా ఎమోషనల్ గా మాట్లాడుతూ.. ‘ఇలాంటి ఘటనల్లో బాధితులు ఎదుర్కొనే బాధ, వారి ఆవేదనను ఆమె ఈ పాట రూపంలో వినిపించారు. ఈ పాటకు ఎవరూ చప్పట్లు కొట్టొద్దని ఆడియన్స్‌ను శ్రేయా ఘోషల్‌ కోరారు. శ్రేయా ఘోషల్‌ పాట పాడడం పూర్తయ్యాక స్టేడియం మొత్తం ‘వీ వాంట్‌ జస్టిస్‌’ నినాదాలతో హోరెత్తింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు