పక్కా ఎంటర్టైనర్ “ధూం ధాం” రిలీజ్ డేట్ వచ్చేసింది!

పక్కా ఎంటర్టైనర్ “ధూం ధాం” రిలీజ్ డేట్ వచ్చేసింది!

Published on Oct 22, 2024 11:01 AM IST


యువ నటీనటులు చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా ఒక పండుగలా తెరకెక్కించిన పక్కా ఎంటర్టైనర్ చిత్రమే “ధూం ధాం”. మరింత మంది ప్రముఖ నటులు సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ కలర్ ఫుల్ చిత్రంకి మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఇది వరకే రిలీజ్ కి రావాల్సి ఉంది కానీ కొంతమేర ఎంటర్టైన్మెంట్ ని వాయిదా వేశారు.

మరి ఇప్పుడు ఫైనల్ గా రిలీజ్ డేట్ ని ఇచ్చేసారు. దీనితో ఈ చిత్రం నవంబర్ 8న విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. సో ఈ పండుగ లాంటి ఎంటర్టైనర్ నవంబర్ లో మొదలు కానుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్ ఎల్ పి వారు రిలీజ్ చేస్తుండడం విశేషం. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి గోపి సుందర్ సంగీతం అందించగా ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు