జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రం ‘ఎఫ్సీయూకే (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్)’. రామ్ కార్తీక్-అమ్ము అభిరామి యువ జంటగా, మరో కీలక పాత్రలో బేబి సహశ్రిత నటించగా విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించారు. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దాము) నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు దర్శకనిర్మాతలు. ఆ విశేషాలు..
‘ఎఫ్సీయూకే’ అని టైటిల్ పెట్టడానికి కారణం ?
దామోదర్ ప్రసాద్ : ఈ సినిమా కథ ‘ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్’ అని నాలుగు ప్రధాన పాత్రలతో నడుస్తోంది. అందుకే టైటిల్ అలా పెట్టాం. షార్ట్ కట్ లో ‘ఎఫీసీయూకే’ అని పెట్టాం. టైటిల్ బూతు అవుతుందని తెలుసు. కానీ సినిమాలో ఎక్కడా బూతు ఉండదు. హాయిగా నవ్వుకోవచ్చు.
ఈ సినిమా ఎలా ఉండబోతుంది ?
ఈ సినిమాకు సోల్ ఆ నాలుగు పాత్రలే. జగపతిబాబు గారు చేసిన పాత్ర పేరు ఫణి. ఆయనది హీరో ఫాదర్ క్యారెక్టర్. మూడు తరాలకు చెందిన పాత్రలు, జనరేషన్ గ్యాప్తో వచ్చే ఇబ్బందులను, ఆ పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలను కామిక్ వేలో చెప్పాం. సినిమా అంతా హిలేరియస్గా నవ్విస్తుంది.
చిన్నపాపతో నటింపచేయడం కష్టమనిపించలేదా?
సాగర్: కష్టమే. ఈ విషయంలో జగపతిబాబు గారికి థాంక్స్ చెప్పాలి. ఆ పాప కాంబినేషన్తో వచ్చే సీన్లను తీసేప్పుడు ఆయన ఎంతో పేషెన్స్తో మాకు సహకరించారు.
సినిమాకు సెన్సార్ నుంచి ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చింది కదా? దానికేమంటారు?
దాము: శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ అనేది ఎప్పుడూ తలదించుకొనే సినిమాలు తియ్యదు. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు సింగిల్ కట్ కానీ, బీప్ కానీ లేకుండా ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. కట్ లేకుండా ‘ఎ’ సర్టిఫికెట్ ఇస్తామంటే తీసేసుకున్నాను.
ఈ సినిమాలో ఏది హైలైట్ అవ్వబోతుంది ?
దాము : హైలైట్ కామెడీ… ఒక్క మాటలో చెప్పాలంటే ఆడియెన్స్కు ఈ సినిమా ఓ కామిక్ రిలీఫ్. ఫాదర్ క్యారెక్టర్కు, అందులోని చిలిపితనానికీ అందరూ బాగా కనెక్ట్ అవుతారు.
సాగర్ : జగపతిబాబు సరైన న్యాయం చేస్తారనిపించి అప్రోచ్ అయ్యాం. వినగానే క్యారెక్టర్కు కనెక్టయి ఓకే చెప్పారు. శోభన్బాబు గారి తర్వాత అంతటి లేడీస్ ఫాలోయింగ్ ఉన్న తెలుగు హీరో జగపతిబాబే.