భారీ యాక్షన్ సీక్వెన్స్ జరుపుకుంటున్న గోపీచంద్ మూవీ

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్‌లో మంచి కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడమే కాకుండా వాటిని సూపర్‌హిట్స్‌గా నిలిచేలా చేస్తున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్రస్తుతం ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్‌తో కలిసి గోపీచంద్ మలినేని ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తు్న్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా మేకర్స్ తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ తాజాగా అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని ఓ భారీ యాక్షన్స సీక్వెన్స్‌ను ప్రస్తుతం షూట్ చేస్తున్నామని.. దీనిని ఫైట్ మాస్టర్ ‘వెంకట్ మాస్టర్’ తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. షూటింగ్ సెట్స్ నుంచి ఓ పోటోను కూడా మేకర్స్ వదిలారు.

ఈ సినిమాను గోపీచంద్ అత్యంత పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మలుస్తున్నాడు. సయ్యామి ఖేర్, రెజినీ క్యాసాండ్రా లేడీ లీడ్ రోల్స్ ప్లే చేస్తుండగా విలక్షణ నటుడు రణ్‌దీప్ హుడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాని వీలైనంత త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Exit mobile version