క‌ల్కి: ఒకే ఫ్రేంలో లెజెండ్స్ అండ్ ట్యాలెంట్!


ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘క‌ల్కి 2898 AD’ కోసం ప్రేక్ష‌కులు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో అంద‌రికీ తెలిసిందే. ఈ సినిమా మ‌రో వారం రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర ప్ర‌మోషన్స్ జోరందుకున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ముంబైలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు మేక‌ర్స్.

ఈ ఈవెంట్ లో ‘క‌ల్కి’ టీమ్ పాల్గొన్నారు. బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్, ఉల‌గ‌న‌య‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో పాటు చిత్ర నిర్మాత‌లు ఈ ఈవెంట్ కు హాజ‌ర‌య్యారు. ఇక ఈ ఈవెంట్ ను టాలీవుడ్ హ‌ల్క్ రానా ద‌గ్గుబాటి హోస్ట్ చేయ‌డం విశేషం. కాగా, సినిమాకు సంబంధించి ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాలు, సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ల‌కు సంబంధించిన విష‌యాల‌ను మీడియాతో పంచుకున్నారు.

ప్రీ-రిలీజ్ ఈవెంట్ ముగిసిన త‌రువాత చిత్ర టీమ్ ఫోటోల‌కు పోజులిచ్చారు. ఈ క్ర‌మంలోనే లెజెండ‌రీ యాక్ట‌ర్స్ అమితాబ్ బచ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్ ల‌తో ప్ర‌భాస్, దీపిక ప‌దుకొనె, స్వప్న ద‌త్, ప్రియాంక ద‌త్ లు క‌లిసి దిగిన ఓ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. “లెజెండ్స్ అండ్ ట్యాలెంట్ ఇన్ వ‌న్ ఫ్రేం” అంటూ ఈ ఫోటోను నెటిజ‌న్లు షేర్ చేస్తున్నారు.

Exit mobile version