యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఈ మూవీ హిందీ ట్రైలర్ను ముంబైలో తాజాగా లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘అరవింద్ గారు నాకు బ్రదర్ లాంటివారు. తండేల్ ఫిబ్రవరి 7న వస్తుంది. అలాగే మా అబ్బాయి నటించిన సినిమా కూడా అదే రోజు వస్తుంది. అయినా పర్లేదు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కి వస్తానని చెప్పాను. కథ బావుంటే ఎన్ని సినిమాలు అయినా ఆడియన్స్ చూస్తారు. తండేల్ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఫెంటాస్టిక్ గా ఉంది. డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశారు. మ్యూజిక్ ఫెంటాస్టిక్ గా ఉంది. తండేల్ ట్రైలర్ లో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉన్నాయి. చైతన్య ఫెంటాస్టిక్ యాక్టర్. ఐడియల్ కోస్టార్. తనతో వర్క్ చేయడం చాలా అమెజింగ్ ఎక్స్పీరియన్స్. సాయి పల్లవి కూడా చాలా మంచి పెర్ఫార్మర్. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలి. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’ అన్నారు.
అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ.. ‘సాయి పల్లవితో చేసిన లవ్ స్టోరీ ట్రైలర్ని అమీర్ ఖాన్ గారు చూసి చాలా బాగుందని మెసేజ్ పెట్టారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు తండేల్ ట్రైలర్ ని అమీర్ ఖాన్ గారు లాంచ్ చేయడం చాలా బలాన్ని ఇచ్చింది. ఆయన ట్రైలర్ లాంచ్ చేయడం నాకు మ్యాజికల్ మూమెంట్. కథ చెప్పినప్పుడే నాకు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇలాంటి కథలు యాక్టర్స్ కి చాలా అరుదుగా వస్తాయి. ఇది నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ. నన్ను ట్రస్ట్ చేసిన అరవింద్ గారికి థాంక్యూ. అరవింద్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని తీశారు. చందూ చాలా అద్భుతంగా సినిమాని తీశాడు. దేవిశ్రీ పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించింది. మీరంతా ఫిబ్రవరి 7న సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.’ అని అన్నారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘తండేల్ సినిమాతో పాటే అమీర్ ఖాన్ గారి అబ్బాయి సినిమా రిలీజ్ అవుతుంది. అయితే నేను ఇక్కడ సినిమా చేసిన సూపర్ స్టార్ ఒక్కరే. ఆయనకి ఫోన్ చేసి ట్రైలర్ లాంచ్ గురించి చెప్పాను. ‘ఏం పర్లేదు.. రెండు సినిమాలు అద్భుతంగా ఆడుతాయి. నేను వస్తున్నాను’అన్నారు. తండేల్ నిజంగా జరిగిన కథ. నిజ జీవితంలోని వ్యక్తులని కలసి వారితో మాట్లాడటం జరిగింది. దర్శకుడు చందూ ఈ కథని అద్భుతంగా తీర్చిదిద్దాడు. జైలు సీన్స్, విలేజ్ సీన్స్, లవ్ స్టొరీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటాయి. సాయి పల్లవి చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసింది. నాగ చైతన్య తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమా కోసం ఏడాదిన్నర పాటుగా నిరంతరం కష్టపడ్డారు. దేవిశ్రీ చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చాడు.’ అని అన్నారు.
డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ.. ‘అమీర్ ఖాన్ గారితో స్టేజ్ ని షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది బ్యూటీఫుల్ లవ్ స్టొరీ. రాజు అనే క్యారెక్టర్ కరాచీలో తన మనుషుల కోసం ఏం చేశాడనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దేవిశ్రీ మ్యూజిక్ తో పాటు రైటింగ్ లో కూడా తన కాంట్రీబ్యుషన్ ఉంది’ అని అన్నారు.