“మధురం” ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ప్రామిసింగ్ గా వుంది – విశ్వక్ సేన్

“మధురం” ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ప్రామిసింగ్ గా వుంది – విశ్వక్ సేన్

Published on Mar 29, 2023 11:00 AM IST

శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఉదయ్ మరియు వైష్ణవి హీరో హీరోయిన్ లుగా ప్రొడ్యూసర్ బంగార్రాజు అలాగే రాజేష్ చికిలే డైరెక్ట్ చేసిన మధురం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రిలీజ్ చేయటం జరిగింది.

ఈ సందర్బంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, “ఆల్ ది బెస్ట్ టూ టీం మధురం. పోస్టర్ చూడటానికి చాలా ప్రామిసింగ్ గా వుంది. ఈ మూవీ చూడాలని చాలా క్యూరియాసిటీ గా వుంది. అలాగే ఈ చిత్రానికి పని చేసిన హీరో ఉదయ్ మరియు ప్రొడ్యూసర్ బంగార్రాజు, డైరెక్టర్ రాజేష్ చికిలేగారికి ఆల్ ది బెస్ట్” అని విశ్వక్ సేన్ ముగించారు.

హీరో ఉదయ్ మాట్లాడుతూ, “మా మధురం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అని అన్నారు.

డైరెక్టర్ రాజేష్ చికిలే గారు మాట్లాడుతూ, “మా మధురం మూవీ ఫస్ట్ లుక్ విశ్వక్ సేన్ గారు లాంచ్ చేసినందుకు చాలా ఆనందంగా వుంది” అని తెలియచేసారు.

ప్రొడ్యూసర్ బంగార్రాజు గారు మాట్లాడుతూ, “మా మధురం మూవీ చిన్న ప్రయత్నాన్ని చాలా పెద్ద మనుసుతో అడగగానే ఫస్ట్ లుక్ లాంచ్ చేసినందుకు విశ్వక్ సేన్ గారి కి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము” అని తెలియచేసారు.

ఉదయ్, వైష్ణవి, సమ్యు రెడ్డి, శ్రీదివ్య, ఉష, అప్పు, రాము, కోటేశ్వరరావు, ఎఫ్ఎం బాబాయ్, కిట్టయ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బ్యానర్ శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్స్, కెమెరామెన్ మనోహర్ కొల్లి, ఎడిటర్ నందమూరి హరి, ఎన్టీఆర్, మ్యూజిక్ వెంకీ వీణ, కొరియోగ్రాఫర్ రామ్ మాస్టర్, లిరిక్స్ రాఖి (rk), కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ రాజేష్ చికిలే, ప్రొడ్యూసర్ బంగార్రాజు ఎం, కో ప్రొడ్యూసర్ ప్రదీప్ కుమార్ సుప్రాణి, పి.ఆర్.ఓ హరీష్, దినేష్ లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు