మార్చి కి వాయిదా పడ్డ అధినాయకుడు

మార్చి కి వాయిదా పడ్డ అధినాయకుడు

Published on Feb 1, 2012 8:36 AM IST

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘అధినాయకుడు’ మార్చి కి వాయిదా పడింది. తొలుత మహా శివరాత్రి కి విడుదల చేద్దాం అని భావించగా, కొన్ని అనివార్య కారణాల వలన చిత్రాన్ని మార్చి 23 కి వాయిదా వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రం లో బాలకృష్ణ సరసన లక్ష్మీ రాయ్ మరియు సలోని నటించగా, జయసుధ ప్రత్యేక పాత్ర లో కనిపించనున్నారు. పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పద్మ కుమార్ చౌదరి నిర్మాత. రాజకీయ కథాంశం తో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తోంది. కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు