మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే – ఆది

మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే – ఆది

Published on Jul 23, 2024 7:22 PM IST

అశ్విన్‌ బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా నటించిన ‘శివం భజే’ ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. ఈ వేడుకకు హాజరైన కమెడియన్‌ ఆది.. అల్లు అర్జున్‌ పై జరిగే ట్రోల్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ, ఆది ఏం మాట్లాడారు అంటే.. ‘అల్లు అర్జున్‌ గారు ఓ నేషనల్‌ అవార్డు విన్నర్‌. ఆయన ఎంతో మంచి వ్యక్తి. ఆయనను మనం అందరం గౌరవించుకోవాలి. గుర్తు పెట్టుకోండి, మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే’ అని ఆది చెప్పుకొచ్చారు.

కమెడియన్ ఆది ఇంకా మాట్లాడుతూ.. ‘కొంతమంది అల్లు అర్జున్‌ ను ఉద్దేశపూర్వకంగా ట్రోల్‌ చేస్తున్నారు. థంబ్‌ నెయిల్స్‌ పెడుతున్నారు. దయచేసి అలా చేయొద్దు. ఇక నుంచైనా ఇలాంటివి ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’ అంటూ ఆది చెప్పుకొచ్చారు. ఆది చేసిన కామెంట్స్ కి బన్నీ ఫ్యాన్స్ సపోర్ట్ గా పోస్ట్ లు పెడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు