“ఎంతవారు గాని” టీజర్ ను రిలీజ్ చేసిన అడివి శేష్!

“ఎంతవారు గాని” టీజర్ ను రిలీజ్ చేసిన అడివి శేష్!

Published on Dec 5, 2022 9:25 AM IST


సూర్య శ్రీనివాస్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో ఎన్ శ్రీనివాసన్ ని దర్శకుడిగా పరిచయం చెస్తూ రాజశేఖర్ అన్నభీమోజు, సురేంద్ర కారుమంచి, శివ ముప్పరాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎంతవారు గాని. సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ని హిట్ చిత్రంతో సక్సెస్ అందుకున్న హిట్ హీరో అడవి శేష్ విడుదల చేసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియచేసారు.

కేవలం ఒక నిమిషం నిడివితో కట్ చేసిన ఈ టీజర్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పారు. ఎంతవారు గాని సినిమాలో ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సస్పెన్స్, రొమాన్స్ కూడా ఉంటుందని ఈ వీడియో ద్వారా వెల్లడించారు. యూత్ ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ తో ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. ఈ టీజర్ చూసిన అడవిశేష్ ఎంతో బాగా వచ్చిందని చెబుతూ చిత్రయూనిట్ ని అభినందించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

దర్శకుడు శ్రీనివాసన్. ఎన్ ను నివాస్ అనే పేరుతో తన రంగీలా సినిమాతో ఎడిటర్ గా పరిచయం చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆ తర్వాత క్షణ క్షణం, గాయం, గోవిందా గోవిందా, రాత్రి, అంతం, ద్రోహి, మనీ, అనగనగ ఒక రోజు, మృగం, రాత్, మనీ మనీ సినిమాలకు ఆయన సౌండ్ ఇంజినీర్ గా పని చేసి అవార్డులను అందుకున్నారు. ఇప్పుడు ఎంతవారుగాని అనే ఈ సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ చూపించబోతున్నారు శ్రీనివాస్ ఎన్.

ప్రవీణ్ K బంగారి సినిమాటోగ్రఫీ అందించారు. విజయ్ కురాకుల సంగీతం అందిస్తున్నారు. JK మూర్తి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఘ్యాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు