“RRR” తర్వాత జోష్ నింపుతున్న మైత్రి మేకర్స్!

“RRR” తర్వాత జోష్ నింపుతున్న మైత్రి మేకర్స్!

Published on Oct 12, 2021 10:54 AM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప” కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ఆమె చేస్తున్న శ్రీవల్లి రోల్ కి సంబంధించి అద్భుతమైన పాట ఈ సినిమా సెకండ్ సింగిల్ గా రిలీజ్ చేస్తుండగా దీనికి పనులు కూడా శరవేగంగా జరుగుతూ ప్రోమోకి మేకర్స్ టైం ఫిక్స్ చేశారు.

అయితే ఇలాంటి అప్డేట్స్ ని అందివ్వడంలో వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎంత యాక్టీవ్ గా ఉంటే వారి ఫాలోవర్స్ అలాగే ఆయా హీరోల అభిమానుల్లో కూడా మంచి కిక్ వస్తుంది. దీనిని కరెక్ట్ గా డీల్ చేసింది మాత్రం “RRR” హ్యాండిల్ అని చెప్పాలి.

తమ ఫాలోవర్స్ తో వారు చాలా బాగా ఇంటరాక్ట్ అవుతూ ఎంటర్టైన్ చేస్తూ కలివిడిగా ఉంటారు. అలానే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ కూడా ఫాలోవర్స్ కి మంచి జోష్ ఇస్తున్నారు. లేటెస్ట్ గా ప్రోమోపై మావా అంటూ క్రేజీ రిప్లై ఇవ్వడంతో అది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇలాంటి సాన్నిహిత్యం అభిమానులకు ఇలా చిత్ర యూనిట్ మధ్య ఉండడం మంచిదే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు