కరోనా ప్రభావం తగ్గాక లవ్ సీన్స్ ప్లాన్ చేస్తారట !

కరోనా ప్రభావం తగ్గాక లవ్ సీన్స్ ప్లాన్ చేస్తారట !

Published on Mar 22, 2020 5:59 PM IST

కెరీర్ బెస్ట్ హిట్ కోసం అక్కినేని అఖిల్ ఈ సారి కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అఖిల్ నాల్గవ చిత్రం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి . దాంతో తన తరువాత సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు అఖిల్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కీలకమైన షెడ్యూల్స్ కూడా పూర్తి అయ్యాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో అఖిల్ – పూజా హెగ్డేల మధ్య కొన్ని లవ్ సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట. ఆ సీన్స్ పూర్తయితే సినిమా టాకీ పార్ట్ పూర్తవుంతుందట.
కరోనా ప్రభావం తగ్గాక ఆ లవ్ సీన్స్ షూట్ ను ప్లాన్ చేయనున్నారు.

ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి. ప్రస్తుతం అఖిల్ తన తరువాత సినిమాల పై కూడా ఫోకస్ పెట్టాడు. త్వరలోనే తన తదుపరి సినిమాల డిటైల్స్ ను తెలియజేస్తానని ఇటీవలే అఖిల్ తెలియజేసిన విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు