“విక్రమార్కుడు” తర్వాత ఈ సినిమా పాత్రే ఎగ్జైట్ చేసింది – అజయ్

“విక్రమార్కుడు” తర్వాత ఈ సినిమా పాత్రే ఎగ్జైట్ చేసింది – అజయ్

Published on Oct 20, 2024 6:27 PM IST

మన టాలీవుడ్ సినిమా దగ్గర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి క్రియేట్ చేసిన హీరోలు, విలన్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలిసిందే. అయితే తన విలన్స్ పాత్రల్లో నటించిన నటులు మరే ఇతర సినిమాలో కూడా అంత పవర్ఫుల్ గా కనిపించరు అని చెప్పడంలో సందేహం లేదు. అలా జక్కన్న క్రియేట్ చేసిన అత్యంత క్రూరమైన విలన్స్ లో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “విక్రమార్కుడు” లో టిట్లా రోల్ కూడా ఒకటి.

మరి ఈ పాత్రని అజయ్ అద్భుతంగా పండించాడు. అయితే మధ్య ఎప్పుడో తన టాలెంట్ చూపించుకునే పత్రాలు రావడం లేదని కూడా చెప్పాడు. అయితే మళ్ళీ అప్పుడు విక్రమార్కుడు తర్వాత మళ్ళీ ఇపుడు చేసిన ఒక్క పాత్ర మాత్రమే తనని ఎగ్జైట్ చేసింది అని తెలిపాడు. మరి ఆ సినిమానే “పొట్టేల్”.

యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ, చంద్ర కృష్ణ కాంబినేషన్ లో సాహిత్ తెరకెక్కించిన ఈ సినిమాలో రోల్ తనకి విక్రమార్కుడు తర్వాత మళ్ళీ ఎంతో కొత్తగా అనిపించింది అని ఇందులో చాలా షేడ్స్ ఉంటాయని నా రోల్ టెర్రిఫిక్ గా వచ్చింది అని అజయ్ స్పెషల్ గా ఈ సినిమాలో రోల్ కోసం తెలిపారు. మరి తన పాత్ర ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ అక్టోబర్ 25 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు