బ్లాస్టింగ్ టీఆర్పీకు సంసిద్ధం అయిన తారక్.!

బ్లాస్టింగ్ టీఆర్పీకు సంసిద్ధం అయిన తారక్.!

Published on Mar 7, 2021 11:37 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాస్ ఆడియెన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. సిల్వర్ స్క్రీన్ పై భారీ ఓపెనింగ్స్ రాబట్టగలిగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరూ ఊహించని విధంగా టెలివిజన్ స్క్రీన్ పైకి బిగ్ బాస్ అనే షో ద్వారా హోస్ట్ గా వచ్చి అదరగొట్టాడు. ఒక పక్క సినిమాలు మరో పక్క షో చేస్తూ మైండ్ బ్లోయింగ్ ఎంటర్టైన్మెంట్ ను ఇచ్చారు.

అయితే దీనిని తారక్ అభిమానులు సులభంగా మర్చిపోతారో లేదో కానీ తారక్ హోస్టింగ్ ను జెనరల్ ఆడియెన్స్ ఒక రేంజ్ లో ఎంజాయ్ చేశారు. మరి తారక్ అప్పుడు స్మాల్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇవ్వడంతోనే భారీ టీఆర్పీలను కొల్లగొట్టాడు. మళ్ళీ ఇప్పుడు అంతకు మించి స్థాయి బ్లాస్టింగ్ టీఆర్పీ సెట్ చెయ్యడానికి జెమినీ టీవిలో “ఎవరు మీలో కోటీశ్వరులు” షో తో రెడీగా ఉన్నాడు.

మరి దీనికి సంబంధించి జెమినీ టీవీ వారు కూడా లేటెస్ట్ గా ఒక చిన్న గ్లింప్స్ క్లిప్ ను విడుదల చేశారు. గతంలో స్టార్ మా లో కింగ్ నాగ్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు కి చిన్న చేంజ్ చేసి డిజైన్ చేసారు అంతే. అయితే చాన్నాళ్లకు మళ్ళీ తారక్ స్మాల్ స్క్రీన్ పై ఎంటర్ అవుతుండడం ఖచ్చితంగా సెన్సేషనల్ టీఆర్పీ రికార్డులను సెట్ చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ రియాలిటీ షో పై మరిన్ని వివరాలు త్వరలోనే రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు