అలీ, నరేశ్, పవ్రితా లోకేశ్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో అలీ సమర్పణలో మోహన్ కొణతాల, బాబా అలీ, శ్రీచరణ్ నిర్మించారు. ఈ చిత్రంలోని మూడో పాటను సమంత విడుదల చే శారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ‘నాకు వాస్తవంతో కూడిన జీవిత కథలంటే చాలా ఇష్టం.
అలాంటి స్టోరీతో అలీగారు నిర్మిస్తున్న మొదటి చిత్రం ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ మంచి హిట్ అవ్వాలి’ అని ఆమె చెప్పుకొచ్చారు. అలీ మాట్లాడుతూ.. ‘నేను అడగ్గానే మా సినిమాలోని మూడో పాటను సమంత రిలీజ్ చేయడం హ్యాపీ. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ హిట్ సాధించాలి’ అన్నారు. ఇక ఎ.ఆర్.రెహమాన్ శిష్యుడు రాకేశ్ పళిదం ఈ సినిమాకు సంగీతదర్శకుడు.