పూరీ జగన్నాథ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై నెలకొన్న ఆసక్తి!

పూరీ జగన్నాథ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై నెలకొన్న ఆసక్తి!

Published on Aug 27, 2024 2:07 AM IST


డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్ లో మరొక ఫ్లాప్ గా డబుల్ ఇస్మార్ట్ నిలిచింది. ఇస్మార్ట్ శంకర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం సీక్వెల్ కనీసం ఓ మోస్తరు హిట్ అయినా సాధిస్తుంది అని అంతా ఆశించారు. లైగర్ ఫలితం రిపీట్ కావడంతో అంతా నిరాశలో ఉన్నారు.

ఇప్పుడు అందరి దృష్టి కూడా పూరీ జగన్నాథ్ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ పై ఉంది. ఈ దర్శకుడు గ్యాప్ తీసుకుంటాడా? లేకపోతే కొత్త హీరోతో ఏదైనా సినిమా చేస్తాడా అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జన గణ మన ప్రాజెక్ట్ లైగర్ చిత్రం ఫలితం కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు వచ్చిన గోల్డెన్ ఛాన్స్ కూడా ఇలా అవ్వడంతో నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తాడు అనే దానికోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు