రష్మిక బాలీవుడ్ మూవీ “గుడ్‌బై” పై సర్వత్రా ఆసక్తి!

రష్మిక బాలీవుడ్ మూవీ “గుడ్‌బై” పై సర్వత్రా ఆసక్తి!

Published on Oct 6, 2022 12:44 PM IST

పుష్ప ది రైజ్ చిత్రం లో శ్రీవల్లి పాత్రతో సెన్సేషన్ క్రియేట్ చేసింది రష్మీక. ఈ చిత్రం తో పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. తన మొదటి బాలీవుడ్ మూవీ గుడ్ బై రేపు విడుదల కాబోతుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ చాలా బాగా జరిగాయి. ఈ చిత్రం విడుదల కి ముందే ఇంకా భారీ ఆఫర్స్ వస్తున్నాయి.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో చేస్తున్న చిత్రం కావడం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడితే రష్మీక కి మరిన్ని బాలీవుడ్ అవకాశాలు రానున్నాయి. వికాస్ బహాల్ దర్శకత్వం వహించిన ఈ ను ఏక్తా కపూర్ నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు