“వరుడు కావలెను” ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా పుష్పరాజ్..!

“వరుడు కావలెను” ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా పుష్పరాజ్..!

Published on Oct 25, 2021 11:41 PM IST


యంగ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం “వరుడు కావలెను”. ఈ చిత్రంలో మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్, ప్రవీణ్, హర్ష వర్ధన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 29న రిలీజ్ కాబోతుంది.

అయితే ఈ నెల 27వ తేదిన ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకోబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐకాన్ స్టార్, పుష్పరాజ్ అల్లు అర్జున్ హాజరు కాబోతున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను రానా దగ్గుపాటి చేతుల మీదుగా రిలీజ్ చేయగా, సంగీత్ ఈవెంట్‌కి టాప్ హీరోయిన్ పూజా హెగ్ధే ముఖ్య అతిధిగా హాజరయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు సూర్య దేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు