ఆ కారణంగా మ్యాచ్ చూడలేదు – అమితాబ్

ఆ కారణంగా మ్యాచ్ చూడలేదు – అమితాబ్

Published on Jun 30, 2024 5:30 PM IST

భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పాజిటివ్ పోస్ట్ లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు సినీ రాజకీయ ప్రముఖులు కూడా టీ20 వరల్డ్ కప్ విజయం పై స్పందించారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ భావోద్వేగానికి లోనయ్యారు.

అమితాబ్ మాట్లాడుతూ.. ‘నేను టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడలేదు. నేను చూస్తే ఇండియా ఓడిపోతుందనే భయంతోనే మ్యాచ్ సాగినంతసేపు నేను టీవీ ఆన్ చేయలేదు’ అని అమితాబ్ తెలిపారు. ఐతే, భారత్ గెలిచిందని తెలిశాక నా కళ్లలో నీళ్లు వచ్చాయని అమితాబ్ బ్లాగ్‌లో రాసుకొచ్చారు. మొత్తానికి రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ గెలిచిన భారత్‌ కు చాలామంది సినీ తారలు విషెస్ తెలుపుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు