ఏఐ తో రజినీ కోసం 27 ఏళ్ళు తర్వాత అనిరుద్ క్రేజీ ప్లాన్

ఏఐ తో రజినీ కోసం 27 ఏళ్ళు తర్వాత అనిరుద్ క్రేజీ ప్లాన్

Published on Sep 8, 2024 5:30 PM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ప్రస్తుతం చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు టి జే జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న యాక్షన్ మల్టీస్టారర్ చిత్రం “వేట్టైయన్” కోసం అందరికీ తెలిసిందే. మరి దీనిపై మంచి బజ్ నెలకొనగా మేకర్స్ ఆల్రెడీ సినిమా ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా ఫిక్స్ చేశారు. అయితే తాజాగా ఈ సాంగ్ తాలూకా ప్రోమోని రిలీజ్ చేయగా రజినీ వింటేజ్ లవర్స్ కి సాలిడ్ ట్రీట్ ని ప్లాన్ చేసారని చెప్పాలి. ఈ సాంగ్ కోసం అనిరుద్ ఏఐ సహాయాన్ని తీసుకున్నాడని చెప్పాలి.

ఈ సాంగ్ ని 27 ఏళ్ళు తర్వాత లెజెండరీ సింగ్ మలేషియన్ వాసు దేవన్ గొంతుని ఈ సాంగ్ కోసం రీక్రియేట్ చేశారు. దీనితో మళ్ళీ తలైవర్ ఫ్యాన్స్ కి పాత రోజులు గుర్తుకొచ్చాయని చెప్పాలి. అలాగే అనిరుద్ కూడా అదిరే బీట్స్ ని ఈ సాంగ్ కి ఇచ్చినట్టుగా ప్రోమో చూస్తే తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ ని మేకర్స్ రేపు సెప్టెంబర్ 9న సాయంత్రం 5 గంటలకి రిలీజ్ చేసున్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి ఈ ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో ఈ అక్టోబర్ 10న రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు