“మత్తు వదలరా” కి మరో మ్యాడ్ సీక్వెల్..

“మత్తు వదలరా” కి మరో మ్యాడ్ సీక్వెల్..

Published on Sep 14, 2024 1:00 AM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ప్రస్తుతం జక్కన్న కాంపౌండ్ నుంచి అదరగొడుతున్న యంగ్ హీరో శ్రీ సింహా కూడా ఒకడు. మరి హీరోగా చేసిన మొదటి చిత్రం “మత్తు వదలరా” కొన్నేళ్ల కితం వచ్చి సూపర్ హిట్ అయ్యింది. మరి ఈ చిత్రాన్ని రితేష్ రానా దర్శకత్వం వహించగా ఈ చిత్రానికి సీక్వెల్ ని మేకర్స్ ఇపుడు తీసుకొచ్చారు.

ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం కూడా మంచి టాక్ ని తెచ్చుకోగా ఇప్పుడు ఈ సినిమాకి మేకర్స్ మరో సీక్వెల్ ని కన్ఫర్మ్ చేసేసారు. సినిమా లాస్ట్ లో సింహ అలాగే నటుడు సత్యతో ఇంట్రెస్టింగ్ సీన్ తో ఫన్నీగా ఈ సీక్వెల్ ని వారు కన్ఫర్మ్ చేశారు. మరి ఇపుడు పార్ట్ 2 కూడా అనుకున్న రేంజ్ హిట్ అయితే దీనికి కూడా మరో మ్యాడ్ సీక్వెల్ రానుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు