ఏపీ లో “గుంటూరు కారం” కి టికెట్ రేట్స్ పెంపు!

ఏపీ లో “గుంటూరు కారం” కి టికెట్ రేట్స్ పెంపు!

Published on Jan 10, 2024 8:05 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 50 రూపాయల పెంపును అనుమతించింది. పెరిగిన టిక్కెట్ ధర జనవరి 12 నుండి 10 రోజుల పాటు వర్తిస్తుంది.

ఈ సినిమాకి ఇది చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. గుంటూరు కారం చిత్రం కి సంబందించిన బుకింగ్‌లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్టార్ట్ కానున్నాయి. టిక్కెట్ రేట్లు పెంచబడినప్పుడు, బెనిఫిట్ షో గురించి ఏమీ ప్రస్తావించలేదు. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు