క‌ల్కి క‌లెక్ష‌న్ల‌పై నిర్మాత జోస్యం!

క‌ల్కి క‌లెక్ష‌న్ల‌పై నిర్మాత జోస్యం!

Published on Jun 29, 2024 7:00 PM IST

‘క‌ల్కి 2898 AD’ మూవీ ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ములేపుతోంది. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. ఇక ఈ సినిమా తొలిరోజు నుండే బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. సాలిడ్ వ‌సూళ్ల‌తో క‌ల్కి కొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది.

ఈ సంద‌ర్బంగా చిత్ర నిర్మాత సి.అశ్వినిద‌త్ మీడియాతో మాట్లాడారు. క‌ల్కి సినిమాకు వ‌స్తున్న రెస్పాన్స్ చూసి సంతోషంగా ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగానూ స్ట్రాంగ్ గా వెళ్తుంద‌ని ఆయ‌న తెలిపారు. క‌ల్కి సినిమా టోట‌ల్ ర‌న్ లో రూ.1400-1500 కోట్ల వ‌ర‌కు క‌లెక్ట్ చేస్తుంద‌ని అశ్విని దత్ జోస్యం చెప్పారు.

దీంతో క‌ల్కి మూవీ టోట‌ల్ ర‌న్ లో ఎంత‌మేర వ‌సూళ్ల‌ను రాబ‌డుతుందా అని అంద‌రూ ఆస‌క్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో నటించారు. సంతోష్ నారాయ‌ణ‌న్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు