బాలయ్య తరపున సీఎం రేవంత్ కు చెక్ అందించిన కూతురు తేజస్విని!

బాలయ్య తరపున సీఎం రేవంత్ కు చెక్ అందించిన కూతురు తేజస్విని!

Published on Sep 13, 2024 11:00 PM IST

వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా నష్టం సంభవించింది. కొంతమంది ప్రాణాలను కూడా కోల్పోయారు. అయితే వరద బాధితులను ఆదుకునేందుకు ఎంతో మంది ప్రముఖులు సహాయ సహకారాలు అందించారు. సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు విరాళాలు భారీగా ప్రకటించారు. ఇప్పటికే కొంతమంది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి చెక్కులను అందజేశారు.

అయితే టాలీవుడ్ అగ్ర హీరో, నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్వయంగా చెక్ ను అందజేశారు బాలకృష్ణ. తెలంగాణ రాష్ట్రానికి కూడా 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. అయితే బాలయ్య తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేశారు ఆయన కూతురు తేజస్విని. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు