సెన్సార్ పూర్తి చేసుకున్న “భలే ఉన్నాడే”

సెన్సార్ పూర్తి చేసుకున్న “భలే ఉన్నాడే”

Published on Sep 11, 2024 3:00 AM IST

టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు జే. శివసాయి వర్ధన్ రచన మరియు దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ భలే ఉన్నాడే. సెప్టెంబర్ 13, 2024న థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజైన టీజర్ మరియు ట్రైలర్ సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేసింది. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ ను ఇచ్చారు. మనీషా కంద్కూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని రవి కిరణ్ ఆర్ట్స్ మరియు మారుతి టీమ్ లు నిర్మించాయి. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం తో రాజ్ తరుణ్ హిట్ సాధిస్తాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు