డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “బర్త్ మార్క్”

షబ్బీర్ కల్లరక్కల్ మరియు మిర్నా మీనన్ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ విక్రమ్ శ్రీధరన్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ డ్రామా బర్త్ మార్క్. ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించింది. సేపియన్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై విక్రమ్ శ్రీధరన్ మరియు శ్రీరామ్ శివరామన్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిపోయింది.

ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఆహా వీడియో ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులని సొంతం చేసుకుంది. ఈ నెల 8 వ తేదీ నుండి ఆహా వీడియోలో ప్రసారం కానుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version