లక్ష్మణుడిగా బాలీవుడ్ హీరో !

లక్ష్మణుడిగా బాలీవుడ్ హీరో !

Published on Mar 8, 2021 3:34 PM IST

నేషనల్ స్టార్ ప్రభాస్ “ఏ- ఆది పురుష్” అనే మరో భారీ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బడా ద‌ర్శ‌కుడు సంజ‌య్ రౌత్ దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా ఆదికావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కుతుంది. అయితే రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. మరి మరో కీలక పాత్ర అయిన లక్ష్మణుడి పాత్రలో మరో యంగ్ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ హీరో వికీ కౌషల్ ను లక్ష్మణుడి పాత్ర కోసం తీసుకుంటున్నారట. అయితే ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రకు చాల ఇంపార్టెన్స్ ఉందని.. అందుకే వికీ కౌషల్ ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఇక సీతగా కృతి సనోన్‌ నటిస్తోందట. కాగా బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ఏ బాలీవుడ్ స్టార్ తోనో ఇలాంటి భారీ సినిమాను చేయకుండా, సౌత్ హీరో అయిన ప్రభాస్ తో చేయడం నిజంగా విశేషమే. అన్నట్టు ఈ సినిమాని 3డి విజువ‌ల్ గ్రాఫిక్స్ తో ఒక మ‌హ‌దాద్భుతంగా తెర‌కెక్కించి దేశంలోని అన్ని భాష‌లతో పాటు విదేశాల్లోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు