డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “బడ్డీ”

డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “బడ్డీ”

Published on Aug 25, 2024 11:00 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో, సామ్ ఆంటోన్ రచన మరియు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బడ్డీ. గాయత్రి భరద్వాజ్ మరియు ప్రిషా రాజేష్ సింగ్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం ఆగస్టు 2, 2024న థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం తాజాగా డిజిటల్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

బడ్డీ థియేట్రికల్ విడుదలైన నాలుగు వారాల తర్వాత ఆగస్టు 30, 2024 నుండి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉండనుంది. హిందీ వెర్షన్‌కు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేనప్పటికీ, ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అజ్మల్ అమీర్, ముఖేష్ రిషి మరియు మహమ్మద్ అలీ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని. స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై నిర్మించారు. డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు