అల్లు శిరీష్ “బడ్డీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా కార్తీ!

టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో చిత్రం తరువాత బడ్డీ అనే ఒక్క సినిమానే ప్రకటించాడు. శాన్ అంటోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఆగస్ట్ 2, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ ఇప్పటికే వేగవంతం చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. జూలై 27 వ తేదీన హైదరాబాద్ లో ట్రిడెంట్ హోటల్ లో నిర్వహించనున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ కి స్టార్ యాక్టర్ కార్తీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన బడ్డీ చిత్రంలో గాయత్రీ భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా సింగ్, ముఖేష్ రిషి, మహమ్మద్ అలీ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. హిప్‌హాప్ తమిళా ఈ చిత్రం కి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Exit mobile version