భారీగా రేమ్యురేషణ్ పెంచేసిన అగ్ర హీరోలు

భారీగా రేమ్యురేషణ్ పెంచేసిన అగ్ర హీరోలు

Published on Feb 2, 2012 11:40 AM IST

ఫిలిం వర్గాల తాజా సమాచారం ప్రకారం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలు తొందర్లోనే తమ రేమ్యురేషణ్ భారీగా పెంచబోతున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వీరు నలుగురు దాదాపు 11 కోట్ల నుండి 13 కోట్ల రూపాయల వరకు తమ రేమ్యురేషణ్ పెంచబోతున్నారు. గత సంవత్సరం తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీ విజయాలు సొంతం చేసుకోవడం, కలెక్షన్లు కూడా భారీగా వసూలు చేస్తుండటంతో వీరు కూడా అమాంతం పెంచేసారు.

ఒక ఇండస్ట్రీ అనలిస్ట్ మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీ లోకి కార్పోరేట్ సంస్థలు వస్తుండటంతో కొత్తగా భారీ మార్కెట్ పెరిగి నెంబర్ గేమ్స్ మారాయని అన్నారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా పెరగడం. ఒక యావరేజ్ సినిమా కూడా 30 కోట్ల వరకు వసూలు చేస్తున్నాయి. అగ్ర హీరోలు 11 నుండి 13 కోట్లు రేమ్యురేషణ్ తీసుకుంటూ 95 రోజులు కాల్షీట్లు ఇస్తున్నారు. మరో ఐదు రోజులు గ్రేస్ పీరియడ్ గా ఇస్తున్నారు. మొత్తంగా ౧౦౦ రోజులు కాల్షీట్లు ఇస్తూ ఈ సమయంలోపు సినిమా తీయలేకపోతే ఒక రోజు అదనంగా 15 లక్షల రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తారు ఈ అగ్ర హీరోలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు