భారీ రేటుకు ‘గేమ్ ఛేంజర్’ ఓటీటీ డీల్..?

భారీ రేటుకు ‘గేమ్ ఛేంజర్’ ఓటీటీ డీల్..?

Published on Oct 18, 2024 3:01 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తుండగా పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.

అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రైట్స్‌కి సంబంధించి ఓ వార్త సినీ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ‘గేమ్ ఛేంజర్’ మూవీపై నెలకొన్న భారీ హైప్ కారణంగా ఈ చిత్ర ఓటీటీ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ని ఏకంగా రూ.50 కోట్లకు సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో మేకర్స్ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. జనవరి 10న ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు