చైతూ కొత్త వెబ్ సిరీస్ వార్తలు.. కేవలం పుకార్లేనట!

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ‘తండేల్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో చైతూ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ అందుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

అయితే, ఈ సినిమా తరువాత చైతూ ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ‘ధూత’ అనే వెబ్ సిరీస్‌లో నటించిన చైతన్య, ఇప్పుడు మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు సైన్ చేయబోతున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది. అయితే, ఇదంతా కేవలం పుకార్లేనని తెలుస్తోంది. చైతూ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం ‘తండేల్’ మూవీపైనే పెట్టాడని, ఎలాంటి వెబ్ సిరీస్‌కు ఆయన ఓకే చేయలేదని ఆయన పర్సనల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.

దీంతో చైతూ వెబ్ సిరీస్ వార్తలు అంతా కూడా ట్రాష్ అని తేలిపోయింది. ఇక ‘తండేల్’ మూవీలో చైతన్య పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది.

Exit mobile version