వంశీ పైడిపల్లి నెక్స్ట్ మూవీపై క్రేజీ రూమర్..?

టాలీవుడ్‌లో హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి లాస్ట్ మూవీ తమిళ స్టార్ హీరో విజయ్‌తో ‘వారిసు’తో మనముందుకు వచ్చాడు. ఆ తరువాత ఆయన నుంచి ఎలాంటి సినిమా రాలేదు. దీంతో వంశీ పైడిపల్లి తన నెక్స్ట్ మూవీని ఎవరితో తెరకెక్కిస్తారా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే, ఇప్పుడు ఈ విషయంపై సినీ సర్కిల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది.

వంశీ పైడిపల్లి ఇప్పుడు తన నెక్స్ట్ మూవీని బాలీవుడ్ హీరోతో తెరకెక్కించాలని చూస్తున్నాడట. ఇప్పటికే యంగ్ హీరోలు రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్‌లతో టచ్‌లో ఉన్న ఈ డైరెక్టర్.. ఇప్పుడు స్టార్ హీరో అమీర్ ఖాన్‌తో చర్చలు జరుపుతున్నాడట. అమీర్ కోసం ఓ భారీ కథను వంశీ పైడిపల్లి రెడీ చేస్తున్నాడని.. ఆయన దానికి ఓకే చెప్పగానే ఓ భారీ చిత్రాన్ని ప్రారంభించేందుకు వంశీ రెడీ అవుతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాను అమీర్ ఓకే చేస్తే, పాన్ ఇండియా స్థాయిలో మరో బిగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయమని సినీ సిర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమాకు అమీర్ ఖాన్ ఓకే చెబుతాడా.. లేదా అనేది వేచి చూడాలి.

Exit mobile version