బజ్ : ‘పుష్ప – ది రూల్’ తో ‘సింగం ఎగైన్’ బాక్సాఫీస్ క్లాష్ లేనట్లేనా ?

బజ్ : ‘పుష్ప – ది రూల్’ తో ‘సింగం ఎగైన్’ బాక్సాఫీస్ క్లాష్ లేనట్లేనా ?

Published on Sep 13, 2023 1:00 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. అందరిలో భారీ అంచనాలు కలిగిన ఈ మూవీని స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా 2024 ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

అయితే అదే డేట్ ని ఇప్పటికే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటిస్తున్న సింగం ఎగైన్ కోసం లాక్ చేసారు మేకర్స్. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న సింగం ఎగైన్ పై అక్కడి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఇక మరోవైపు పుష్ప ది రూల్ మూవీపై నార్త్ ఆడియన్స్ లో కూడా భారీ హైప్ ఉండడంతో రెండిటి మధ్య బాక్సాఫీస్ వద్ద క్లాష్ ఏర్పడితే ఒకింత థియేటర్స్ విషయంలో సమస్య రావడంతో పాటు రెండు మూవీస్ ఇబ్బందిలో పడడం ఖాయం అని తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఆలోచన చేస్తోన్న సింగం మేకర్స్, తమ సినిమాని పుష్ప ది రూల్ తో క్లాష్ లేకుండా మరికొన్నాళ్లు పాటు వాయిదా వేసే ఆలోచన చేస్తున్నారనేది లేటెస్ట్ బాలీవుడ్ బజ్. అయితే దీనిపై ఆ మూవీ మేకర్స్ నుండి అఫీషియల్ ప్రకటన అయితే రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు