ఇటీవల బాలీవుడ్ సినిమా దగ్గర వచ్చి భారీ వసూళ్లు సొంతం చేసుకున్న హిస్టారికల్ హిట్ చిత్రం “ఛావా” కోసం అందరికీ తెలిసిందే. వెర్సటైల్ హీరో విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ చిత్రం భారతీయుల్ని ఉద్వేగానికి లోను చేసింది.
ఇలా ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రపై తెరకెక్కించిన ఈ చిత్రం ఇపుడు మరో హిస్టారికల్ మూమెంట్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా తాలూకా స్పెషల్ స్క్రీనింగ్ ని భారతదేశ పార్లమెంట్ లో వేయనున్నట్టుగా ఇపుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మార్చ్ 27 గురువారం సాయంత్రం 6 గంటలకి ఛావా ప్రత్యేక ప్రదర్శన ఉండబోనుండగా ఈ స్క్రీనింగ్ కి దేశ వ్యాప్తంగా ఎంపీలు అంతా హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది.
అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ స్క్రీనింగ్ లో సినిమాని చూడనున్నారట. దీనితో ఈ టాక్ వైరల్ గా మారింది. అయితే నార్త్ లో చాలా మంది మాట్లాడుకుంటున్నప్పటికీ మేకర్స్ నుంచి ఈ ప్రైడ్ మూమెంట్ పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.