ఏపీ సీఎం చంద్రబాబుతో మెగాస్టార్ చిరంజీవి భేటి

ఏపీ సీఎం చంద్రబాబుతో మెగాస్టార్ చిరంజీవి భేటి

Published on Oct 12, 2024 8:00 PM IST

ఏపీ సీఎం చంద్రబాబును మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఏపీలో సంభవించిన వరదల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోవడంతో మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ.కోటి విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే, తాజాగా హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో చిరు ఈ మేరకు విరాళాన్ని సీఎంకు అందజేశాడు. దీనికి సంబంధించిన చెక్కులను చిరంజీవి చంద్రబాబుకి అందజేశారు. చిరంజీవి విరాళంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. సేవా కార్యక్రమాలలో ఎప్పుడూ ముందుండే చిరంజీవి, ఏపీలో వరద బాధితులకు సాయం అందించడంపై చంద్రబాబు ప్రశంసించారు.

సినిమా రంగం నుంచి ఏపీ వరద బాధితులకు భారీ విరాళాలు అందజేసినందుకు ఈ సందర్భంగా చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. భేటి అనంతంర చిరుని కారు వరకు వెళ్లి సీఎం చంద్రబాబు వీడ్కోలు పలికారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు