జగన్ కి కృతజ్ఞతలు తెలుపుతూ చిరు ట్వీట్..!

జగన్ కి కృతజ్ఞతలు తెలుపుతూ చిరు ట్వీట్..!

Published on May 24, 2020 2:56 PM IST

మెగా స్టార్ చిరంజీవి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అనుకూలంగా ఆయన తీసుకున్న నిర్ణయాలను అభినందించారు. ఇక చిత్ర పరిశ్రమకు మేలు చేకూర్చే సింగిల్ విండో విధానం ప్రవేశ పెడుతూ జి ఓ జారీ చేసిన నేపథ్యంలో జగన్ కి చిరంజీవి ఫోన్ చేసి కృతఙ్ఞతలు తెలిపారు. ఇక చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై చర్చించేందుకు లాక్ డౌన్ అనంతరం జగన్ ని చిరంజీవి కలువనున్నట్లు చిరు తన ట్వీట్ లో పొందుపరిచారు.

విశాఖ వేదికగా చిత్ర పరిశ్రమ అభివృద్ధి జరగనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో చిరు తాజా ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు చిరు అధ్యక్షతన చిత్ర ప్రముఖులు కృషి చేస్తున్నారు. ఈ విషయమై చిత్ర ప్రముఖులు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలవడం జరిగింది. చిత్ర పరిశ్రమ సంక్షేమం కోసం చిరంజీవి చేస్తున్న కృషికి సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు