కేరళ సిఎం కి కోటి చెక్ అందజేసిన మెగాస్టార్ చిరంజీవి!

కేరళ సిఎం కి కోటి చెక్ అందజేసిన మెగాస్టార్ చిరంజీవి!

Published on Aug 8, 2024 8:00 PM IST

తెలుగు సినీ పరిశ్రమలో ఏ కష్టం వచ్చినా, ముందు ఉండే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఇటీవల కేరళ రాష్ట్రంలో వయనాడ్ లో ప్రకృతి సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ నుండి మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ లు కలిసి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ రోజు సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి గారు కేరళ రాష్ట్రానికి వెళ్లి, ముఖ్యమంత్రి పినారాయ్ విజయన్ కోటి ను కలిసి కోటి రూపాయల చెక్ ను అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ సహాయానికి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక విశ్వంభర చిత్రంతో చిరు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు