“ప్రణయగోదారి” ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి

“ప్రణయగోదారి” ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి

Published on Jun 16, 2024 7:37 AM IST

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అలీ కుటుంబం నుంచి వచ్చిన నటుడు సడన్ హీరోగా ప్రియాంక ప్రసాద్ హీరోయిన్ గా పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ ఫీల్ గుడ్ సినిమానే “ప్రణయ గోదారి”. మంచి కంటెంట్ సినిమాలని ఆదరిస్తారనే నమ్మకం తోనే తన సినిమా కూడా విజయం సాధిస్తుంది అని తమ కంటెంట్ ని మేకర్స్ నమ్ముతున్నారు. పిఎల్‌వి క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా పారమళ్ళ లింగయ్య ఈ ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తు మరోవైపు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ లాంచ్ చేశారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదగా ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అదేవిధంగా PLV క్రియేషన్స్ బ్యానర్ లోగో కూడా లాంచ్ చేశారు మంత్రి. ఈ పోస్టర్స్ రిలీజ్ చేసిన అనంతరం చిత్ర యూనిట్ మొత్తాన్ని అభినందించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జెడ్ పిటిసి సభ్యులు సురేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ప్రణయగోదారి పోస్టర్ చూస్తుంటే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతోందని చెప్పడమే గాక.. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే టైటిల్‌కి తగ్గట్టుగా నాచురల్ లొకేషన్స్ లో సీన్స్ చిత్రీకరించారని తెలుస్తోంది. పోస్టర్ లో గోదారి అందాలు, అక్కడి ప్రజల జీవన విధానాలు ప్రస్ఫుటం అవుతున్నాయి. నది ఒడ్డున హీరో హీరోయిన్ సైకిల్ పై ప్రయాణం చేస్తూ కనిపిస్తుండటం యువతను ఆకర్షించే పాయింట్ అని చెప్పుకోవాలి.

ఇక ఈ చిత్రానికి మార్కండేయ సంగీతం అందిస్తుండగా ఈదర ప్రసాద్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. చీఫ్ కో డైరెక్టర్ గా జగదీశ్ పిల్లి, డిజైనర్ గా TSS కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ గా గంట శ్రీనివాస్ వర్క్ చేస్తున్నారు. కొరియోగ్రఫర్స్ కళాధర్ , మోహనకృష్ణ , రజిని, ఎడిటర్ కొడగంటి వీక్షిత వేణు, ఆర్ట్ విజయకృష్ణ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు