ఇటీవల నటి రమ్య గుండెపోటుతో మరణించిందనే బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే, ఈ వార్త పూర్తిగా అవాస్తవమని క్లారిటీ వచ్చింది. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO) ఆమె మరణం గురించి తప్పుడు వార్తను షేర్ చేయడం తో చాలామంది నటికి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే, జెనీవాలో తీసిన రమ్య ఫోటోను ఒక జర్నలిస్ట్ షేర్ చేయడంతో ఫ్యాన్స్ PRO పై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సూర్య యొక్క వారణం ఆయిరం (సూర్య సన్ ఆఫ్ కృష్ణన్)లో తన పాత్రకు పేరుగాంచిన రమ్య, ఇటీవల తెలుగులో బాయ్స్ హాస్టల్గా విడుదలైన కన్నడ సూపర్హిట్ హాస్టల్ హుడుగారు బేకగిద్దరేలో కనిపించింది. ఆమె మంచి ఆరోగ్యంతో ఉంది. ప్రస్తుతం ఆమె రాబోయే చిత్రం ఉత్తరాఖండ షూటింగ్లో ఉంది.


