బ్రేకీవెన్ కొట్టేసిన ‘కమిటీ కుర్రోళ్లు’.. 4 రోజుల్లో అదిరే నంబర్స్

బ్రేకీవెన్ కొట్టేసిన ‘కమిటీ కుర్రోళ్లు’.. 4 రోజుల్లో అదిరే నంబర్స్

Published on Aug 13, 2024 1:30 PM IST

రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి వచ్చిన యూత్ ఫుల్ నోస్టాలాజిక్ ఎంటర్టైనర్ చిత్రం “కమిటీ కుర్రోళ్లు”. యువ నటీనటులు చాలా మంది నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు యదు వంశీ తెరకెక్కించగా మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణం వహించి మంచి ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కి తీసుకొచ్చింది. మరి తమ కంటెంట్ మీద నమ్మకంతో ముందు రోజు సాయంత్రమే పైడ్ ప్రీమియర్స్ కి ఈ చిత్రాన్ని తీసుకురాగా ఈ చిత్రం సాలిడ్ హిట్ టాక్ ను ఆడియెన్స్ నుంచి తెచ్చుకుంది.

ఇలా మొదటి రోజు నుంచే మంచి నంబర్స్ అందుకుంటూ వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు 4 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకుని అదరగొట్టింది. మరి ఈ నాలుగు రోజుల్లోనే కమిటీ కుర్రోళ్ళు అన్ని ఏరియాల్లో బ్రేకీవెన్ కొట్టేసినట్టుగా మేకర్స్ ఇపుడు కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ నాలుగు రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 7.48 కోట్ల గ్రాస్ ని అందుకొని అదరగొట్టింది. దీనితో మొత్తానికి సాలిడ్ రన్ ని కొనసాగించింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు