బజ్.. ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న ‘కమిటీ కుర్రోళ్ళు’..?

బజ్.. ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న ‘కమిటీ కుర్రోళ్ళు’..?

Published on Aug 22, 2024 10:01 PM IST

మెగా డాటర్ నిహారిక ప్రొడ్యూసర్‌గా నిర్మించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కొత్త నటీనటులు నటించారు. యదు వంశీ డైరెక్ట్ చేసిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను కూడా రాబట్టింది.

అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి సినీ సర్కిల్స్‌లో ఓ వార్త వినిపిస్తోంది. ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ని మంచి ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసిన తరువాత ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని వారు చూస్తున్నారట.

సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ మరియు ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో నటించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రాన్ని ఓటీటీలో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి నిజంగానే ఈ చిత్రాన్ని ‘ఆహా’ సొంతం చేసుకుందా అనేది అధికారిక ప్రకటన వచ్చాకే తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు