ఆక‌ట్టుకుంటున్న ‘క‌మిటీ కుర్రోళ్ళు’ ట్రైల‌ర్


మెగా డాట‌ర్ నిహారిక ప్రొడ్యూస్ చేస్తున్న తాజా చిత్రం ‘క‌మిటీ కుర్రోళ్ళు’ ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ వ‌ర్గాల్లో మంచి బ‌జ్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు య‌దు వంశీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ ప‌నుఉ ముగించుకున్న ఈ మూవీ, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. ఇక ఈ క్రమంలో ఈ చిత్ర ట్రైల‌ర్ ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

‘క‌మిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో దాదాపు అంద‌రూ కొత్తవారే న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమా క‌థ 90ల‌లో జరిగే గోదావ‌రి బ్యాక్ డ్రాప్ తో తెర‌కెక్కిన‌ట్లుగా ఈ ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ప‌ల్లెటూరిలో జరిగే జాత‌ర‌, స్నేహితులు, వారి మ‌ధ్య మ‌నస్ప‌ర్థ‌లు, గ్రామీణ రాజ‌కీయాలు వంటి అంశాల చుట్టూ ఈ సినిమా న‌డుస్తుంద‌ని ఈ ట్రైల‌ర్ ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

ట్రైల‌ర్ క‌ట్ ఆక‌ట్టుకునే విధంగా ఉండ‌టంతో ప్రేక్ష‌కుల్లో ఈ సినిమాపై ఆస‌క్తి రేకెత్తుతోంది. ఈ సినిమాలో సందీప్ స‌రోజ్, య‌శ్వంత్ పెండ్యాల‌, ఈశ్వ‌ర్ ర‌చిరాజు, త్రినాథ్ వ‌ర్మ, ప్ర‌సాద్ బెహ‌రా త‌దిత‌రులు న‌టిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించిన ఈ సినిమాను ఆగ‌స్టు 9న రిలీజ్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Exit mobile version